గతవారం సీతాదేవి 'టెస్ట్ట్యూబ్ బేబీ' అవుతుందా? అన్న విషయం గురించి, రామాయణ గాథలో చెప్పినట్టుగా ఎవరూ బయోటెక్నాలజీ పద్ధతుల ద్వారా ఆ రోజుల్లో శిశ్వోత్పత్తి వీలుకాదనీ తెలుసుకున్నాం. మరి అదే ప్రశ్నలో ప్రస్తావించబడిన సదరు పెద్దమనిషి నారదుడే గూగుల్ అనీ నాటి పుష్పక విమానమే నేటి విమానాల కన్నా గొప్పదనీ ప్రకటించినట్టు తెలుస్తోంది. నేడు మనం కంప్యూటర్ యుగంలో వున్నాం. రామాయణ కాలాన్ని త్రేతాయుగం అంటారు. ఒక యుగం అంటే ఎంత కాలమో ఎన్ని సంవత్సరాలో ఎక్కడా ఖచ్చితమైన గణాం కాలు లేవు. నేను కూడా గూగుల్ చేశాను. అంతోయింతో ప్రస్తుతం శాస్త్రీయంగా వైజ్ఞానిక సమాచారాన్ని ఇస్తున్న వికీపీడియాలోని కథనాల ప్రకారం 12 లక్షల 96వేల (12,96,000) సంవత్సరాల క్రితం త్రేతాయుగం ప్రారంభ మయింది. అంతకుముందు కృతయుగం (లేదా సత్యయుగం) వుండేది. అది నేటి నుంచి గతంలోకి వెళితే సుమారు 17 లక్షల 28వేల (1728000) సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యింది. అపుడు ధర్మం అనే నంది నాలుగు కాళ్లమీద నడిచేది. మనిషి సగటు ఆయుర్ధాయం సుమారు 4000 సంవత్సరాలు. కృతయుగం దాటాక యుగసంధి కాలంలో ధర్మం గాడి తప్పింది. తర్వాత ద్వాపరయుగం ప్రారంభమయ్యింది. అపుడు ధర్మనంది కేవలం 3 కాళ్ల మీదే నడిచేది. ఆ ఒక్క పాదపు అధర్మ సంహార్ద్రం ఆ మూడు కాళ్ల ధర్మాన్ని సంరక్ష ణార్థం తిరిగి నాలుగు కాళ్ల మీదికి ధర్మసంస్థాపనార్థం యుగయుగా లుగా సంభవించే విష్ణువు రామాయణావతారంలో భూమ్మీదకొచ్చి రావణ సంహారం చేసి సుమారు 11 వేల (11000) సంవత్సరాల పాటు రామరాజ్యాన్ని నెలకొల్పి పాలించాడు. రాముడు తిరిగి నాలుగు కాళ్ల మీదికి ధర్మసంస్థాపన చేశాక మరో యుగసంధిలో ధర్మం గాడితప్పి ద్వాపరయుగంలోకి ప్రవేశించాక కేవలం రెండు కాళ్ల మీదే నడవ సాగింది. మళ్లీ శిశుపాలుడు, కంసుడు వంటి అధర్ముల్ని ప్రత్యక్షంగా, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వంటి అధర్ముల్ని పరోక్షంగా దుష్టశిక్షణ నిమిత్తం విష్ణువు మళ్లీ ఈ క ష్ణావతారం ఎత్తాడు. ఆ ద్వాపరయుగం నేటి నుంచి సుమారు 8 లక్షల 64 వేల (864000) సంవత్సరముల క్రితం ప్రారంభమయి నేటి నుంచి గతంలోకి వెళితే 4 లక్షల 32 వేల (432000) సంవత్సరాల వరకు కొనసాగగా, ఆ 432000 సంవత్సరాల క్రితం మన వర్తమాన కలియుగం ప్రారంభమయింది. ఈ కలి యుగం లో ధర్మం మరీ గాడి బాగా తప్పి మూడు కాళ్ల మీద అధర్మం, ఒంటికాలి మీద మాత్రమే ధర్మం నడుస్తోంది. ఒకనాటి అధర్మాన్ని తుదముట్టించి, ధర్మ సంస్థాపనకు సంభవించిన రాముడి కన్నా, రెండు కాళ్ల మీద నడిచిన అధర్మాన్ని ప్రతిఘటించి ధర్మసంస్థాపనను గావించిన క ష్ణుడికన్నా బలమైన రీతిలో మరింత చాకచక్యంగా 3 కాళ్లపై నడుస్తున్న వర్తమాన అధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా సంస్థాపన చేయడానికి కలి పురుషుడు సంభవిస్తాడని హైందవ మత విశ్వాసాలు పేర్కొంటు న్నాయి. ఆ కలియుగ కలిపురుషుడి రాకకోసం మనమందరం ఎదురు చూస్తున్నాము. ఈలోగా అ ధర్మం నాలుగు కాళ్ల మీద పరిణమించే ప్రమాదం వస్తుందేమోనన్న ఆందోళన ధర్మపరిరక్షకాశయులకు వుంది.
ప్రయోగాల ద్వారా, సునిశిత పరిశీలనలతో కూడిన వైజ్ఞానిక ఋజువుల ద్వారా రూఢ అయినది. విషయం ప్రకారం మానవుడు జీవ పరిణామం ద్వారా ఉద్భవించాడు. పట్టుమని 20 లక్షల సంవత్సరాల క్రితం వరకు మానవుడే లేడు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు మానవుడు ఆదిమ మానవుడిగా కేవలం 15 లేదా 20 సంవత్సరాల సగటు ఆయుర్ధాయంతో ఈ భూమ్మీద మసలాడు. నేటి నుంచి సుమారు 16 వేల సంవత్సరాల క్రితం నుంచే మానవుడికి లిపి గురించిన అవగాహన వచ్చింది. ఆధునిక కాలంలోనే క్రీ.శ.1900 సంవత్సరాలలో ప్రపంచ సగటు మానవ ఆయుర్దాయం కేవలం 25 సంవత్సరాలు. స్వతంత్రం వచ్చేనాటికి (1947) ధర్మ సంరక్షణ కోసం యుగయుగాలుగా సంభవించిన భారతదేశంలో సగటు ఆయుర్దాయం కేవలం 30 సంవత్సరాలే!
ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా విద్యుదయస్కాంత క్షేత్ర బలాల (వశ్రీవష్తీశీఎaస్త్రఅవ్ఱష ళవశ్రీసర) ప్రమేయం లేకుండా సమాచారాన్ని ఒక చోటి నుంచి మరో చోటికి చేరవేయడం అసంభవమని ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు ఋజువు చేశాయి. అన్ని యుగాల్లోను ఉండే నారదు డు అలా ఎలా బ్రతికాడు. మరణంలేని నార దుడు, హనుమంతుడి జాడలేవి? కనీసం ఆ ప్రముఖ మేధావికన్నా కనిపించాడా?
- ప్రొఫెసర్
ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
Authorization