ప్రశ్న: ఈ భూమిపై పంటల్ని ఎక్కడయినా పండించవచ్చా?
భూమిక, ఎస్విబికె పాఠశాల
జవాబు: భూమిపై వివిధ రకాలయిన వృక్షజాతులున్నాయి. మనకు, ఆయా జంతువులకు అవసరమయిన ఆహార పదార్థాలను ఇచ్చే వృక్షజాతుల్ని పంటలు (Crops) అంటాము. వరి, రాగి, గోధుమ, బార్లీ, సజ్జ, జొన్న వంటి ధాన్యాల్ని ఇచ్చే వృక్షజాతి మొక్కలను పంటలు అంటాము. సాధారణంగా ఇవన్నీ గడ్డిజాతి మొక్కలు. అంతేకాదు చెరకు, పొగాకు, చిక్కుడు, పసుపు, పత్తి, బంగాళదుంప, ఆకుకూరలు తదితర వ్యాపార పంటలు కూడా పంటలే! జంతు, వృక్ష జాతులన్నింటికీ వృక్షాల ద్వారా తయారయ్యే ఆహార పదార్థాలే జీవాధారం.
తమ ఉనికికి, మనుగడకు కూడా వృక్షాలు, పంటలు ఆహార పదార్థాల్ని తయారు చేస్తాయి. పంటలు క్షాలు కొన్ని లేక వేనవేల జాతులున్నాయి. వృక్ష కణంలో వున్న జన్యుస్మ తి (genetic code) ఆధారంగా పలు జాతులు (speies) ఉన్నాయి. ఆయా జాతుల వృక్షాల జన్యు నిర్మాణాన్ని బట్టి ఎప్పుడు ఆకులు రావాలి, ఎన్ని ఆకులు రావాలి, ఎప్పుడు పుష్పించాలి, ఎప్పుడు కాయలుగా మారాలి, ఎప్పుడు ఫలించాలి అన్న ఆంతరంగిక నిర్దేశనంతో పాటు వాతావరణ సంబంధ విషయాలయిన పీడనం, ఉష్ణోగ్రత, నేలలో తేమ శాతం, నేలలో రసాయనిక సంఘటనం, కాంతి సోకే సమయం, కాంతి తీవ్రత వంటి ఎన్నో విషయాలు ఆయా వృక్ష జాతుల జీవనశైలి అరమరిక ఆధారపడుతుంది. ఈ విధంగా ప్రకృతితో తలపడి ప్రకృతి విధించే పరీక్షలకు అనుగుణంగా జయప్రదం అయ్యేలా కాలక్రమేణా గతితార్కిక పద్ధతితో జీవ పరిణామం జరిగి వివిధ జాతులు ఉద్భవించాయి. ఈ విషయాన్నే మహనీయుడు చార్లెస్ డార్విన్ తన పరిణామ సిద్ధాంతంలో భాగంగా 'Origin of the Species by Natural Selectiondw (ప్రకతి వరణం ద్వారా జాతుల ఆవిర్భావం) అన్న ఉద్గ్రంధాన్ని రచించాడు. కార్ల్ మార్క్స్ విరచిత 'కాపిటల్' తర్వాత అత్యంత ప్రభావిత గ్రంధం అది. కాపిటల్ గ్రంధం మానవ సంబంధాల్ని, సామాజిక సంబంధాల్ని ఆ సంబంధాల్ని ప్రభావితం చేసే ఆర్థిక సంబంధాల్ని అందులో మానవ శ్రమకున్న ప్రభావం వంటి సామాజికాంశాలకు దర్పణం పట్టగా, భూమ్మీద ఉన్న భౌతిక రసాయనిక లక్షణాల వల్లనే వివిధ వృక్షజంతువులెలా ఆవిర్భవించాయి, ఏవి సమసి పోయాయి (అంతరించి పోయాయి, ఎందుకు అంతరించి పోయాయి). ఏవి నిలబడి బతికి బట్ట కట్ట గలుగుతున్నాయి, వీటికున్న హంగులు, ఆర్భాటాలు ఏమిటి, భవిష్యత్తులో ఎలాంటి జీవజాతుల ఆవిర్భావానికి అవకాశం ఉందన్న వివరాలు పరిణామ సిద్ధాంత గ్రంధంలో ఉంటాయి.
పాదార్థిక వాస్తవాల్ని విశాల విశ్వాంతరాళం నుంచి అత్యంత సూక్ష్మస్థాయిలో వాటి ధర్మాల్ని విశదపరిచే శాస్త్రం క్వాంటం సిద్ధాంతం.అలా కాపిటల్, పరిణామ సిద్ధాంతం, క్వాంటం సిద్ధాంతం ఈ మూడింటితో విశ్వం మొత్తాన్ని వివరించగలం. భూమ్మీద అన్నిచోట్ల ఒకే విధమైన నేలసారం నేల రసాయనిక భౌతిక లక్షణం ఉండదు. భూమ్మీద అన్ని చోట్ల వాతావరణ సంఘటనం, వాతావరణ పీడనం, వాతావరణ ఉష్ణోగ్రత ఉండదు. భూమ్మీద అన్నిచోట్ల ఒకే విధమైన కాంతి సౌలభ్యత వుండదు. అందువల్ల ఆయా భూ భౌతిక, భూ రసాయనిక వాతావరణ పీడనోష్ణగ్రతల ఆధారంగా వివిధ వృక్షజాతుల అంతరంగిక జన్యు నిర్మాణం సంసిద్ధంగా, సర్దుకునేలా ఉంది కాబట్టి అన్నిచోట్ల అన్ని రకాలయిన పంటలు పండవు. ఎంత గింజుకున్నా ఎడారుల్లో చెరకు, వరి వంటి పంటలు పండవు. ఎంత తీవ్రంగా ప్రయత్నించినా (హరిత గృహంలో కాకుండా) బాహాటంగా బయటి పొలాల్లో వరంగల్ చుట్టుపక్కల, కడప నేలల్లో యాపిల్ పంటల్ని పండించలేము.
కొంచెంలో కొంచెంగా జన్యు మార్పిడి (Genetic Modification) ద్వారా, సంకరీకరణం (Hybridization) ద్వారా కొద్దోగొప్పో పంటల పెరుగుదలలలో కొన్ని మార్పుల్ని తీసుకురాగలిగినారు. ప్రపంచమంతా ఒకే విధమైన పంటల బదులు ఇలా వైవిధ్యముంటేనే జీవవైవిధ్యం (Biodiversity) అవుతుంది.
- ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
Authorization