హ్యాండ్సెట్ తయారీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఫోన్లను లాంచ్చేస్తూనే ఉంది. దీనికి సంబంధించిన మరో రెండు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అవి గెలాక్సీ ఏ 60, ఏ 40 ఎస్. కంపెనీ ఇటీవల గెలాక్సీ ఏ80, గెలాక్సీ ఏ70 ఫోన్లతోపాటు వీటిని ఆవిష్కరించింది.
కొత్త ఫోన్ల ఫీచర్లు..
శాంసంగ్ గెలాక్సీ ఏ60లో 6.3 అంగుళాల ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరా (32 ఎంపీం8 ఎంపీం5 ఎంపీ), 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 జీబీ/128 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. గెలాక్సీ ఏ60 ధర రూ.20,700. గెలాక్సీ ఏ40 ఎస్లో 6.4 అంగుళాల ఇన్ఫినిటీ యూ డిస్ప్లే, ఇక్సినోస్ 7904 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా (13 ఎంపీం5 ఎంపీం5 ఎంపీ), 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ప్రింట్ సెన్సర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. గెలాక్సీ ఏ40ఎస్ ధర రూ.15,600. రెండింటిలోనూ బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కాగా ఇవి చైనా మార్కెట్లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ ఈ ఫోన్లను త్వరలోనే భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముంది. మరోవైపు గెలాక్సీ ఏ80 మే నెలలో ఇండియన్ మార్కెట్లోకి రానుంది. దీని రూ.45,000 నుంచి రూ.50,000 శ్రేణిలో ఉండొచ్చు.
Authorization