ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, ఐడియా వంటి సంస్థలకు ధీటుగా కొత్త కొత్త ప్రిపెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్లాన్లను ఆవిష్కరిస్తోంది. కొన్ని ప్లాన్లపై అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ వాలిడిటీ సాధారణంగా ఏప్రిల్ చివరికల్లా ముగియాల్సి ఉంది. అయితే కంపెనీ అదనపు డేటా గడువును జూన్ 30 వరకు పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది. అదనపు డేటా ఆఫర్లో భాగంగా ప్రిపెయిడ్ మొబైల్ యూజర్లు రోజుకు 2.21 జీబీ అదనపు డేటాను పొందొచ్చు. అంటే ఇకపై రూ. 186 ప్రిపెయిడ్ ప్లాన్పై రోజుకు 1 జీబీకి బదులుగా 3.21 జీబీ డేటా పొందొచ్చు. రూ.429 ప్లాన్పైనా ఇదే డేటా లభిస్తుంది. రూ.485, రూ.666 లలో రోజుకు 1.5 జీబీ డేటా కు బదులుగా 3.71 జీబీ డేటా పొందొచ్చు. రూ.1,699 ప్లాన్పై రోజుకు 2 జీబీకి బదులుగా 4.21 జీబీ డేటా అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్ కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. వీటితో పాటు రూ.187, రూ.349, రూ.399, రూ.447 వంటి ప్రిపెయిడ్ ఎస్టీవీ రీచార్జ్లపై కూడా అదనపు డేటా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిపైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Authorization