స్మార్ట్ఫోన్స్ అమ్మకాలు ఇచ్చిన జోష్తో చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ హువావే టీవీ తయారీ విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ కంపెనీ అమ్మకాలు 2019 తొలి త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 50 శాతం పెరిగాయి. దీంతో యాపిల్ కంపెనీని వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీగా అవతరించింది. హువావే అదిరిపోయే స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా 5జీ సపోర్ట్ ఫీచర్తో 8కే స్మార్ట్ టీవీ తీసుకురానుంది. కంపెనీ మేట్ 20ఎక్స్ 5జీ, ఫోల్డబుల్ మేట్ ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ల మాదిరే ఈ టీవీల్లోనూ 5జీ మాడ్యూల్స్ను అమర్చనుంది. హువావే కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ఫోన్స్ తయారీ కంపెనీల్లో ఒకటి. అలాగే కమ్యూనికేషన్ ఉపకరణాలను కూడా సరఫరా చేస్తూ ఉంటుంది. ఒకవేళ హువావే టీవీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తే శాంసంగ్ కంపెనీకి గట్టి పోటీ ఎదురైనట్టే అని చెప్పవచ్చు.