శాస్త్రవేత్తలు రోజురోజుకు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అందువల్లే మనకు ప్రస్తుతం ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇదే తరహాలో బ్యాటరీతో పనిలేని ఫోన్ను తయారు చేస్తున్నారు. అవి వస్తే, మనకిక ఛార్జింగ్ సమస్యలు లేనట్లే. మొబైల్లో ఉన్న బ్యాటరీ ఎంత కాలం పని చేస్తుందనే విషయాన్ని బట్టి, ఏ స్మార్ట్ఫోన్ కొనాలి.. ఎన్నాళ్ళు వినియోగించొచ్చు అని వినియోగదారులు అంచనా వేస్తుంటారు. సాధారణంగా చాలా ఫోన్లు 3000 నుంచి 4000 mAhమధ్య ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువవ్వడంతో పాటు ఛార్జింగ్ సమస్య వెంటాడుతోంది. ఛార్జింగ్ కోసం అదనంగా పవర్ బ్యాంకుల్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రయాణాలలో అయితే చార్జింగ్ చాలా అవసరం. ఈ పరిస్థితులను అధిగమించడానికి వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు బ్యాటరీ అవసరం లేని మొబైల్ ఫోన్ను తయారు చేశారు. బ్యాటరీ లేదంటే ఛార్జింగ్ లేనట్లే కదా. అయినప్పటికీ ఆ ఫోన్ పని చేస్తోంది. అదెలా అంటే.. మనం ఉపయోగించే విద్యుత్ బదులు రేడియో సిగల్స్ను వినియోగించుకుని పనిచేస్తుంది. వారి ప్రయోగం విజయవంతమైంది. ఫలితంగా బ్యాటరీలేని ఫోన్లు... లైట్ వెయిట్ మైక్రోవేవ్స్ని ఉపయోగించుకుని పని చేస్తున్నాయి. ఆ మొబైల్ ఫోన్ ద్వారా... స్కైప్ కాల్స్ చేయడానికి వీలైంది. ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ పవర్తో పనిచేసే వీలుంటుందా అనే అంశంపై పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. అవి విజయవంతమైతే త్వరలోనే బ్యాటరీలేని, ఛార్జింగ్ అవసరం లేని మొబైల్ ఫోన్లను మనం వినియోగించొచ్చు. అదే జరిగితే... స్మార్ట్ ఫోన్ ప్రపంచమే మారిపోతుంది. స్మార్ట్ఫోన్లు మరింత స్లిమ్ డిజైన్తో తయారు చేయడానికి వీలవుతుంది. మొబైల్ ఫోన్ల పరిశోధనల్లో ఇదొక విప్లవాత్మకమైన అడుగు పడినట్టేనని చెప్పుకోవచ్చు.
Authorization