స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగిపోవడంతో రోజుకు 2 జీబీ డేటా కూడా సరిపోని పరిస్థితి ఎదురవుతోంది. అవసరాన్ని బట్టి ఇండ్లలో చాలా వరకు రోటర్లు ఉపయోగిస్తున్నవారు లేకపోలేదు. అంతేకాదు కొన్ని హాస్టళ్ళల అయితే ఫ్రీ వైఫై బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ఇదే తరహాలో భారతీయ రైల్వే కూడా చాలా స్టేషన్లలో ఉచిత వైఫై హాట్స్పాట్స్ను ఏర్పాటు చేసింది. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవల్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం 1600 పైగా రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ చాలా మంది ఎలా ఉపయోగించాలో విధానం తెలియక ఎంత సేపు స్టేషన్లో ఉన్నా సరే ఇబ్బంది పడుతుంటారు. దానిని ఉపయోగించడానికి చేయాల్సింది.
వినియోగం ఎలా
ఏదైనా రైల్వే స్టేషన్కు వెళ్ళినపుడు అక్కడ రైల్వైర్ వైఫై సర్వీస్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఒక వేళ ఉంటే స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్లో వైఫై సెట్టింగ్స్ ఆన్ చేయాలి. నోటిఫికేషన్ పైన క్లిక్ చేaస్త గూగుల్ రైల్వే సర్వీస్ వెబ్పేజీ ఓపెన్ అవుతుంది. పై భాగంలో రైట్ కార్నర్లో స్టార్ట్ బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్కు ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీ డివైజ్లో వైఫై కనెక్ట్ అవుతుంది. ఒకసారి ఒక స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్లీ వేరే స్టేషన్కు వెళ్ళినపుడు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వైఫై ఆన్ చేస్తే ఆటోమెటిక్గా కనెక్ట్ అవుతుంది. ఎంతసేపైనా ఉపయోగించుకోవచ్చనుకుంటే పొరపాటే. కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉచితంగా సేవలు పొందగలరు. అందులోనూ 350 ఎంబీ డేటా మాత్రమే ఉచితంగా వినియోగించుకునే వీలుంటుంది. అందువల్ల ఈ సారి ఎక్కడికైనా వెళ్ళినపుడు అవసరాన్ని బట్టి ఈ సేవలు వినియోగించుకోవచ్చు.
Authorization