షావోమి భారత్లో కొత్త కొత్త ప్రొడక్టులతో అన్ని వర్గాల ప్రజలకు చేరుక కావాలని భావిస్తోంది. కంపెనీ తాజాగా వైర్లెస్ హెడ్ఫోన్స్ తీసుకువచ్చేందుకు సిద్దమైంది. వీటిని జూలై 15న లాంచ్ చేయనుంది. ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా టీజర్ విడుదల చేసింది. ప్రస్తుతం రెడ్మి కే20 స్మార్ట్ఫోన్ విడుదల చేస్తుందని భావించిన గాడ్జెట్ ప్రియులకు ముందుగా హెడ్ఫోన్స్ను ముందుగానే మన దేశీ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. సూపర్ డిజైన్తో అదిరిపోయే లుక్తో హెడ్ఫోన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ధర ఎంత ఉంటుందని సంస్థ సమాచారం వెల్లడించలేదు. అయితే ఇందులో బ్యాటరీ బ్యాకప్ ఏకంగా 20 గంటల పాటు ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఫీచర్ ఉండే అవకాశముంది. హెడ్ఫోన్స్ డిజైన్, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది.