భారత టెలికాం సంస్థ ప్రీపెయిడ్కు సంబంధించి రెండు రీఛార్జ్ ప్లాన్లో మార్పులు చేసింది. అవి రూ .186, రూ .187. ఈ రెండు ప్లాన్లలో ఇప్పటివరకు 1 జీబీ డేటా అందిస్తోంది. ఇక నుంచి రోజుకు 2 జీబీ డేటా అందివ్వనుంది. ఈ ప్లాన్ల కాలపరిమితి 28 రోజులు. రూ .186 రీఛార్జిలో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ లభిస్తాయి. వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్ పొందవచ్చు. అదనంగా, కంపెనీ వ్యక్తిగత రింగ్ బ్యాక్ టోన్లకు ఉచితంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు అందిస్తోంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఆఫర్ల కింద రూ.186, రూ.289, రూ.485, రూ.666, రూ.1,699 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లున్నాయి. కొన్ని అపరిమిత ఎస్టీవీలు రూ .187, రూ. 349, రూ. 399, రూ .448 కూడా ఈ ఆఫర్ ద్వారా ప్రయోజనాలను పొందుతున్నాయి. ఈ ఆఫర్ కొత్తగా కనెక్షన్ తీసుకున్న వారితో పాటు పాత వినియోగదారులకూ వర్తిస్తుంది.