ఆన్లైన్ మెసేజ్లు పంపించుకోవడానికి బాగా ప్రాచుర్యం పొందింది వాట్సాప్, టెలిగ్రామ్. ఇందులో కాంటాక్ట్ నెంబర్లు, ఫొటోలు, వీడియోలు కూడా పంపుకోగలుగుతున్నాం. వీటితో పాటు లోకేషన్ అప్డేట్స్ను సైతం షేర్ చేసుకోగలుగుతున్నాం. వీటిలో సెక్యూరిటీ నిమిత్తం ఉపయోగించే ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ అందులో ఉంది. అందువల్ల ఇవి బాగా ప్రజాధరణ పొందాయి. కానీ సాంకేతికత పెరిగే కొద్దీ హ్యాకింగ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల సిమాంటెక్ నిర్వహించిన పరిశోధనలో ఈ రెండు యాప్లలో సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చూపించాయి. వీటికి మీడియా ఫైల్ జాకింగ్ అనే కొత్త భద్రతా లోపం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. సెమాంటిక్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం వాట్సాప్ ఫైళ్ళను ఆటోమెటిక్గా బయట స్టోరేజ్ ద్వారా సేవ్ అవుతుంటాయి. అయితే టెలిగ్రామ్ మాత్రం 'గ్యాలరీ సేవ్' అనే ఫీచర్ని ప్రారంభించినప్పుడు మాత్రమే బయట స్టోరేజీలో సేవ్ అవుతుంది. అటువంటి మీడియా ఫైల్ హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉందని వారు వెల్లడించారు. కానీ దీనిని అడ్డుకునేందుకు ఏ యాప్లు లేవనీ నిర్ధారించారు. 'మీడియా ఫైల్ జాకింగ్' లోపం వల్ల చాటింగ్, ఫైల్ షేరింగ్ వంటివి కొంత సమయం తర్వాత మాత్రమే చూసే వీలుంటుంది. షేర్ చేసేవి ఏవైనా వెంటనే అవతలి వారికి కనిపించవు. ఈ ఆలస్యమే హ్యాకర్లు ఫైళ్ళను హ్యాక్ చేసే అవకాశం అందిస్తోంది. 2017లో టెలిగ్రామ్లో హ్యాకర్లు ఖాతాలను స్వాధీనం చేసుకోగలిగే లోపం ఉన్నట్లు కనుగొన్నారు. ఫైళ్ళను ఎక్స్టర్నల్ స్టోరేజ్లో స్టోర్ చేసినప్పుడు సమస్య మొదలవుతుంది. అందువల్లే వీటిలో ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ సాంకేతిక పరంగా భద్రతను కలిగించగలవని పరిశోధకులు వివరించారు. ఇందుకు పరిష్కారంగా మున్ముందు రాబోయే 'స్కోప్డ్ స్టోరేజ్' ఫీచర్ సహాయపడనుంది.
Authorization