ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షావోమి అనుబంధంగా ఉన్న రెడ్మి తాజాగా కొత్త ల్యాప్టాప్ను ఆవిష్కరించింది. దీనిపేరు రెడ్మిబుక్ 14 సిరీస్. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 10 గంటల వరకు వస్తుంది. అలాగే ల్యాప్టాప్లో 4 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ 14 అంగుళాలు. అల్ట్రాన్యారో హెచ్డీ డిస్ప్లే అదనపు ఆకర్షణగా ఉంది. మల్టీ టచ్ జెశ్చర్స్, ఫుల్ సైజ్ కీబోర్డు ఫీచర్లు కూడా ఉన్నాయి. డీటీఎస్ ఆడియో సపోర్ట్, న్యూ కూలింగ్ సిస్టమ్, ఇంటెలిజెంట్ అన్లాక్ 2.0 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది విండోస్ 10 ఓఎస్పై పని చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, స్టూడెంట్ ఎడిషన్ ప్రిలోడెడ్గావస్తాయి. దీని బరువు 1.5 కేజీలు. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ఉంటుంది. ధర రూ.32,000. ఇంటెల్ ఐ5 ప్రాసెసర్ కలిగిన రెడ్మిబుక్ 14 ల్యాప్టాప్తో పోలిస్తే దీని ధర దాదాపు రూ.8,000 తక్కువ కావడం గమనార్హం. అయితే ఈ ల్యాప్టాప్ను ఆ సంస్థ చైనా మార్కెట్లోనే లాంచ్ చేసింది. మన దేశానికి ఎప్పటివరకు వస్తుందనేది ఇంకా సమాచారం లేదు.
Authorization