టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అందుకే కంపెనీలు కస్టమర్లను కాపాడుకునేందుకు, కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్లాన్లను తీసుకువస్తున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ మధ్య పోటీ ఉంది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం మరో కొత్త ప్రిపెయిడ్ ప్లాన్ను లాంచ్ చేసింది. దీని పేరు మారుతం ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్. దీని ధర రూ.1,188. ఈ ప్లాన్ వాలిడిటీ ఉంటుంది. అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎస్ఎంఎస్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొత్తంగా 1,200 ఎస్ఎంఎస్లు వస్తాయి. దీని వాలిడిటీని 345 రోజులుగా నిర్ణయించారు. కంపెనీ ఏపీ, తెలంగాణ సర్కిల్లో రూ.1,399, రూ.1,001 ప్లాన్లను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ ఈ ప్లాన్ ఆవిష్కరించింది. 5 జీబీ డేటా వస్తుంది. 5 జీబీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఒక ఎంబీ డేటాకు 25 పైసలు కట్ అవుతాయి. కంపెనీ ఈ ప్లాన్ను కేవలం ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా లాంచ్ చేసింది. అంటే ఈ ప్లాన్ జూలై 25 నుంచి 90 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.