దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ కార్బన్ మొబైల్స్ తాజాగా నాలుగు కొత్త ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. చాలా కాలంగా విదేశీ ఫోన్లకు పోటీ పడలేక వెనుకడుగేసిన కార్బన్, కొత్త ఫీచర్లతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తక్కువ ధరలో ఆకర్షణీయ ఫీచర్లు వీటి సొంతం. అతి త్వరలోనే వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇవి కేఎక్స్ సిరీస్లు. వీటి పేర్లు కేఎక్స్3, కేఎక్స్25, కేఎక్స్26, కేఎక్స్27. ధర రూ.700 నుంచి రూ.1,000 మధ్యలో ఉండనుంది. కార్బన్ కేఎక్స్3 మోడల్లో 1.7 అంగుళాల స్క్రీన్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్లెస్ ఎఫ్ఎం రేడియో, రికార్డర్, పవర్ సేవింగ్ మోడ్, వీడియో మ్యూజిక్ ప్లేయర్ వంటి ఫీచర్లున్నాయి. కేఎక్స్25 ఫోన్లో 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 2.4 అంగుళాల స్క్రీన్, ఎఫ్ఎం రేడియో, డ్యూయెల్ సిమ్, ఎల్ఈడీ టార్చ్, డిజిటల్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. కార్బన్ కేఎక్స్26 ఫోన్లో 1.7 అంగుళాల స్క్రీన్, 1450 ఎంఏహెచ్ బ్యాటరీ, డిజిటల్ కెమెరా, వీడియో మ్యూజిక్ ప్లేయర్ వంటి ఫీచర్లు చూడొచ్చు. కేఎక్స్27 ఫోన్లో 1750 ఎంఏహెచ్ బ్యాటరీ, డిజిటల్ కెమెరా, బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ మెసేజ్, బిజినెస్ కార్డ్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త టెక్నాలజీతో ఫోన్లు అందుబాటులోకి తీసుకువచ్చామని, కేఎక్స్ సిరీస్ ఫోన్లు ఇందుకు ఉదాహరణ అని కార్బన్ మొబైల్స్ ఎండీ ప్రదీప్ జైన్ వెల్లడించారు. వినియోగదారులు తమకు ముఖ్యమని పేర్కొన్నారు. భారత్లో గత పదేళ్ల నుంచి సేవలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిస్తామన్నారు. అతి త్వరలో ఈ ఫోన్లు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి.
Authorization