షావోమీ మరో కొత్త స్మార్ట్టీవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే 'ఎంఐ' బ్రాండ్తో స్మార్ట్టీవీలను విడుదల చేసిన సంస్థ, ప్రస్తుతం రెడ్మీ బ్రాండ్లో 'రెడ్మీ టీవీ 70-ఇంచ్' స్మార్ట్టీవీని బీజింగ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించింది. 70 అంగుళాల స్క్రీన్తో వచ్చిన ఈ కొత్త స్మార్ట్టీవీలో అనేక ఆకట్టు ఫీచర్లు ఉన్నాయి. చైనాలో సెప్టెంబరు 10 నుంచి రెడ్మీ స్మార్ట్టీవీ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రీ ఆర్డర్లు మొదలయ్యాయి. అక్కడి కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ ధర 3,799 యువాన్లు. అంటే మన ధర ప్రకారం రూ.38,000గా సంస్థ నిర్ణయించింది. సెప్టెంబరు నెలాఖరు నాటికి భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో ఉన్న ఫీచర్లు.. 70 అంగుళాల, 4 కే రెజల్యూషన్ స్క్రీన్, పాచ్వాల్ ఫ్లాట్ఫామ్ సపోర్ట్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ - 64 బిట్ ఆమ్లోజిక్ ఎస్వోసీ కోర్, హెచ్డీఆర్ సపోర్ట్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డాల్బీ ఆడియో, డీటీఎస్ హెచ్డీ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, డ్యూయల్ యూఎస్బీ పోర్ట్స్, హెచ్డీఎంఐ పోర్ట్, ఏవీ ఇన్పుట్లతో పాటు మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.
Authorization