స్మార్ట్ఫోన్ ఉండి.. వాట్సాప్ ఉపయోగించని వారుండరు. మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్కు విరివిగా ఉపయోగించే యాప్ ఇది. మన దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు కూడానూ. అయితే ఇది విదేశీ యాప్ కావడంతో సొంతంగా ఒక మెసేజింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ యాప్ పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్న కేంద్రం ప్రస్తుతం పరీక్షిస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నేతత్వంలో ఈ వాట్సాప్ టెస్టింగ్ జరుగుతోంది. దీనికి గవర్న్మెంట్ ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీస్ (గిమ్స్)గా పేరు పెట్టింది. ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలు మాత్రమే కాకుండా గిమ్స్ యాప్ను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగించుకోవచ్చు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ గిమ్స్ యాప్ను తయారు చేస్తోంది. ఇదే సంస్థ ప్రభుత్వ శాఖలకు ఈ మెయిల్ సర్వీసులను కూడా అందిస్తోంది. ప్రస్తుతం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రభుత్వ శాఖలకు సంబంధించి రోజుకు 2 కోట్ల ఈ మెయిల్ సర్వీసులను హ్యాండిల్ చేస్తోంది. ప్రభుత్వ విధానాలకు లోబడి జిమ్స్ యాప్ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సాఫ్ట్వేర్పై మొత్తం నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుందని అధికారిక సమాచారం. ముందుగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రారంభించి ఆ తర్వాత మొత్తం 11 ప్రాంతీయ భాషల్లో యాప్ను తీసుకురానున్నారు. ఇక ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లను సపోర్ట్ చేసేలా యాప్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం విదేశాంగ శాఖ, కేంద్ర హౌంశాఖ, సీబీఐ, మెటీ, నేవీ, రైల్వే శాఖలు టెస్టింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 6600 మంది వినియోగదారులు ఈ యాప్ ద్వారా 20 లక్షల మెసేజ్లను జనరేట్ చేసినట్టు అధికారులు చెప్పారు. ఇందులో ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు టెస్టింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా ఈ యాప్ను తీసుకురావడానికి మరో కారణం కూడా ఉంది. అదే హ్యాకింగ్.. ఈ రోజుల్లో పలు కీలక శాఖలు వాట్సాప్ లేదా ఇతర ఇన్స్టెంట్ మెసేజింగ్ సర్వీసుల ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాలలో సమాచారం హ్యాక్ అవుతుండటంతోనే ప్రభుత్వం తనకంటూ ఓ సొంత మెసేజింగ్ యాప్ను తీసుకువచ్చేందుకు నిర్ణయించుకుంది.
Authorization