చాలామంది రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను మరుసటి రోజు వేడి చేసి తీసుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వాటిని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే లేని రోగాలు కొనితెచ్చుకున్నట్టే. అవేమిటంటే.. చికెన్ : దీనిని చాలా మంది మళ్లీ వేడి చేసి తింటారు. అలా చేయడం వల్ల దానిలోని ప్రొటీన్లు పూర్తిగా నశించిపోతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కడుపులో తిప్పడం, అరగకపోవడం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. గుడ్లు: కోడిగుడ్లతో చేసిన వంటకాలనూ ఒకసారికి మించి వేడి చేయకూడదు. అలా చేస్తే దానిలోని పోషకాలు టాక్సిన్లుగా మారతాయి. జీర్ణవ్యవస్థ మీద చెడు ప్రభావం చూపిస్తాయి. మష్రూమ్స్ : ప్రొటీన్లు బాగా దొరికే ఆహారం మష్రూమ్స్. వీటినీ వండిన తర్వాత పదే పదే వేడి చేయటం మంచిది కాదు. అలా చేస్తే ప్రొటీన్లు విషపూరితంగా మారతాయి. అనారోగ్యాలు ఆవరిస్తాయి.