తలనొప్పి, నడుము నొప్పి, ఒళ్లు నొప్పి, కడుపునొప్పి.. నొప్పి ఏదైనా డాక్టరుతో పనిలేకుండా ఠపీమని ఓ పెయిన్ కిల్లర్ వేసుకుంటారు కొందరు. ఇలా ప్రతిదానికీ నొప్పి నివారణ మాత్రలు వేసుకోవడం చాలా ప్రమాదమని అధ్యయనం ఒకటి వెల్లడించింది. నాన్ స్టిరాయిడ్ యాంటీ ఇన్ఫమేటరీ(ఎన్ఎస్ఏఐడీ) మందులను వాడడం అత్యంత ప్రమాదకరమని, రక్తం గడ్డకుండా వేసుకునే వారార్ఫిన్ లాంటి మందులను వేసుకునే వారైతే మరింత జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు చెబుతు న్నారు. ఇటువంటి మాత్రలు వేసుకునే వారు ఆస్ప్రిన్, ఎన్ఎస్ఏఐడీలు వేసుకుంటే అధిక రక్తస్రావమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి వారార్ఫిన్ వంటి మాత్రలు వేసుకునేవారు నొప్పుల విషయంలో వైద్యులను సంప్రదించాలి. వారి సూచన మేరకే నొప్పి నివారణ మాత్రలు వాడాలి.