నేటి తరంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్య కరమైన జీవనం కోసం రక రకాల ఆహార పదార్థాలను తమ డైట్లో చేర్చుకుంటున్నారు. చిరుధాన్యాలు, నట్స్ రోజు వారి ఆహారంలో తీసుకుంటున్నారు. అలాంటి వాటిలో ఎక్కువ పోషకాలు గల గింజలు అవిసెలు. వీటిని రెగ్యులర్గా తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. వీటి వల్ల శరీరానికి చక్కని పోషణ అందుతుంది. పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఇందుకు కారణం అవిసెగింజల్లో దాగి ఉండే పోషకాలే.. - అవిసెల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తొలగిపోతాయి. - అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలను రాకుండా నివారిస్తాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. - అవిసె గింజలను పొద్దున్నే తింటే శరీరానికి శక్తి బాగా అందుతుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. హైబీపీ, మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. - పలు రకాల క్యాన్సర్లను తగ్గించే గుణాలు అవిసె గింజల్లో ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే వెంట్రుకలు, చర్మ సమస్యలు పోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అవిసెల్లో ఎక్కువగా ఉంటాయి కనుక ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. - చేపలు తినలేని వారు అవిసెలను తింటే వాటిల్లో ఉండే పోషకాలు అవిసెల ద్వారా కూడా మనకు లభిస్తాయి.