ఏ వయసులో ఏలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఐదు పదులు దాటిన తరువాత తీసుకునే ఆహారంలో కచ్చితంగా పీచు ఉండాలి అంటున్నారు ఆస్ట్రేలియా యూనివర్శిటీ పరిశోధకులు. యాబై నుంచి డెబ్బై ఏండ్ల మధ్య వయసు గల దాదాపు 1500 మంది మీద నిర్వహించిన అధ్యయనం ఫలితాలను వారు వెల్లడించారు. చాలాకాలం పాటు వీరిలో కొందరికి మామూలు ఆహారం అందించారు. మిగతా వారికి పీచు అధికంగా కలిగిన ఆహారాన్ని అందించారు. కొన్ని నెలల తర్వాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలించగా, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వారిలో ఎక్కువమంది గతం కన్నా మరింత ఆరోగ్యంగా ఉన్నారు. పీచు తీసుకోని వారిలో రకరకాల ఆరోగ్య సమస్యలు వీరి ద ష్టికి వచ్చాయి. అవన్నీ సాధారణంగా వయస్సురీత్యా వచ్చే సమస్యలే అయినా, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన వాటి బారి నుంచి చాలా వరకూ తప్పించుకోవచ్చు అని పరిశోధకులు సూచిస్తున్నారు. న