వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ కాలంలోనే జలుబు, జ్వరం, వైరల్ ఫీవర్ వంటిసమస్యలే కాక ఇన్ఫెక్షన్స్ చుట్టుముడతాయి. వీటిని నివారించాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. కొన్ని ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా విటమిన్ ఎ,సి,ఇలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మాములుగా వేసే దానికన్నా ఎక్కువ పసుపు కూరగాయల్లో వేసుకోవాలి. రెండుమూడు రోజులకు ఒకసారి వేడిపాలలో పసుపు వేసుకుని తాగినా మంచిదే. విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండే బొప్పాయి, కివీ, జామ, నారింజ వంటి పండ్లు తీసుకోవాలి. టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తాగితే మంచిది. చినుకుల్లో చికెన్ సూప్ తాగితే మజానే వేరు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటిమిన్ ఎ, సి, ఇలు పుష్కలంగా ఉండే బాదంపప్పులు, పొద్దుతిరుగుడు విత్తనాలు ఎక్కువగా తీసుకోవాలి. వానాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఎక్కువగా తీసుకుంటూ వ్యాయామం రెగ్యులర్గా చేస్తే అనారోగ్యసమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.