మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఇది తయారవడానికి మాంసకృత్తులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం ముఖ్యంగా అవసరం. హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీల్లో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో వారు బాధపడుతున్నారని గుర్తించాలి.
రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 38 శాతం నుంచి 48 శాతం వరకూ ఉంటుంది.రక్తహీనతకు గురైన వారిలో ఎర్ర రక్త కణాలు (ఆర్ బిసి) సంఖ్య తగ్గిపోతుంది. ఆర్బిసి లో ఆక్సిజన్ను తీసుకునివెళ్లే కణాలను హీమో గ్లోబిన్ అంటారు. రక్తహీనతకు గురైన వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్త కణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. మహిళల్లో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనత, రక్తం తక్కువగా ఉండడం. రక్తహీనత ముఖ్యంగా మూడు కారణాల వలన వస్తుంది.
పౌష్టికాహార లోపం: శరీర పోషణకు కావల్సిన ఆహారం తీసుకోకపోవడంతో రక్తహీనత వస్తుంది.
రక్తం నష్టపోవడం: రుతుస్రావం ద్వారా మహిళలు అధికంగా రక్తాన్ని కోల్పోయినా, కడుపులో నట్టల వల్ల మలంలో రక్తం పడటం వల్ల పిల్లలు రక్తహీనతకు లోనవుతారు.
ఉత్పత్తి తగినంత లేకపోవడం: కొన్నిరకాల జబ్బుల కారణంగా ముఖ్యంగా మలేరియా వలన రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అవుతాయి. తిరిగి అవి పెరగకపోవడం, రక్త కణాల ఉత్పత్తి తగినంత లేకపోవడం వలన రక్తహీనత వస్తుంది.
లక్షణాలు
నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం అలసట, చికాకు, ఆకలి లేకపోవడం, కళ్ళు తిరగడం అరచేతుల్లో చెమట పాదాలలో నీరు చేరడం చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో ఆసక్తి లేకపోవడం, నీరసం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ..
ఇది ప్రత్యేకించి జబ్బు కాదు. సరైన ఆహారం తీసుకుంటే చాలావరకు సమస్య కలుతుంది.
చిన్న పిల్లలకు కడుపులో నట్టలు పోయే మందు ఇవ్వాలి. మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో
శుభ్రంగా కడుక్కునేలా అలవాటు చేయాలి.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతోటి ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి.
టీనెజ్ అమ్మాయిల నుంచి బిడ్డకు జన్మనించే మహిళల వరకు అందరికీ ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.
ఆకుకూరలు రక్తహీనత నివారణకు సులభమైన ఉపాయం. ఇనుము ఎక్కువగా వుండి, సులభంగా లభించి, చవకగా అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు అంటే తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. ఇవేగాక బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూర, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా ఇనుము పుష్కలంగా లభిస్తుంది.
రోజూ తీసుకొనే ఆహారంలో మొలకెత్తిన పప్పుధాన్యాలు విటమిన్ సి ఎక్కువగా వుండి నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.
Authorization