పని భారం అధికంగా ఉన్నప్పుడు సహ జంగా శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడికి గురికావటం వల్ల పని పట్ల ఏకాగ్రత క్రమంగా తగ్గుతుంది. పని చేస్తున్న సమయంలో ఏకాగ్రత తగ్గకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. - పని చేసే సమయంలో నరాలు ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే ఉడకబెట్టిన గుడ్డును తింటే సరిపోతుంది. ఇది తినటం వల్ల మెదడులోని నరాల పని విధానం సక్రమంగా జరుగుతుంది. గుడ్డులో ఉండే పోషకాలు ఏకాగ్రతను పెంచుతాయి. అలాగే గుడ్డు సంతోషాన్ని కల్గించే కొన్ని హార్మోన్లును విడుదల చేస్తుంది. ఆనందంగా ఉంచటంతో పాటు ఏకాగ్రతను పెంచుతుంది. - ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాక్స్లో కొన్ని చిరు ధాన్యాలను, గింజలను వేసుకుని పోవటం మంచిది. ఇవి శారీరకంగా అన్ని సమస్యలను దూరం చేస్తాయి. అలాగే వీటిలో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజలవణాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ 'ఇ' సమృద్ధిగా ఉంటాయి.