సాధారణంగా జీర్ణసంబంధ సమస్యలకు సొంత వైద్యం చేస్తుంటారు. అసిడిటీ, కడుపులో నొప్పి, విరోచనాలు , అజీర్తి, వికారం, మలబద్ధకం లాంటి జీర్ణసంబంధ సమస్యలు ప్రతి ఒక్కరిలో ఎప్పుడో ఒకసారి వేధిస్తాయి. ఇలాంటి సమస్యలకు డాక్టర్ను సంప్రదించకుండా మందులు వేసుకుంటారు. అయితే ఈ సమస్యలు ఎక్కువగా ఉంటే మాత్రం జీర్ణవ్యవస్థతో సంబంధం ఉన్న సమస్యగానే భావించి తప్పనిసరిగా వైద్యులను కలవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. - జంక్ ఫుడ్లో వాడే పదార్థాలు, అవి తయారయ్యే విధానం ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయి. కారణం రెస్టారెంట్లు, హౌటళ్లలో ఒకే నూనెను పదే పదే మరిగిస్తూ ఉంటారు. అలా మరిగిం చడం మూలంగా ఆ నూనెల్లో ట్రాన్స్ఫ్యాట్స్ తయారవుతాయి. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. ఇవి జీర్ణవ్యవస్థతో పాటు గుండెకూ చేటు చేస్తాయి. అందుకే జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. - అశుభ్రమైన పదార్థాలు, అశుభ్రమైన పరిసరాల్లో ఈ కోలి ఎక్కువగా పెరుగుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలను కలుగజేసే సూక్ష్మజీవి ఇదొక్కటే! గ్యాస్ట్రిక్, డియోడినమ్ అల్సర్లు, గ్యాస్ట్రిక్ కేన్సర్ లాంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియా పొట్టలో చేరితే అవసరానికి మించి ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దాంతో యాసిడ్తో సంబంధం ఉన్న సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కడుపు లో మంట, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. పరిసరాలు శుభ్రంగా ఉంటుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి.