Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రాంపురం వద్ద బొలేరో ట్రాలీ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 14మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుగుండ మండలం బాలికుంట గ్రామస్థులు మరిపెడబంగ్లాలో జరుగుతున్న ఓ శుభకార్యానికి బొలేరో ట్రాలీ వాహనంలో బయలుదేరారు. వేగంగా వచ్చిన వీరి వాహనం రాంపురం వద్దకు రాగానే అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ(40) అనే మహిళ మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై మొగిలి ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలించారు.