Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం(4వ తేదీన) 21,118 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,012 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 70,958కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 13 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 576కి చేరింది. కరోనా నుంచి నిన్న 1139 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ను జయించిన వారి సంఖ్య 50,814కు చేరింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,568కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 532 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 198, రంగారెడ్డి జిల్లాలో 188 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 15, భద్రాద్రి కొత్తగూడెం 52, జీహెచ్ఎంసీ 532, జగిత్యాల 27, జయశంకర్ భూపాలపల్లి 46, గద్వాల్ 48, కామారెడ్డి 75, కరీంనగర్ 41, ఖమ్మం 97, మహబూబ్ నగర్ 51, మహబూబాబాద్ 36, మంచిర్యాల 1, మెదక్ 21, మేడ్చల్ 198, ములుగు 18, నాగర్ కర్నూల్ 19, నల్గొండ 49, నారాయణపేట 4, నిర్మల్ 9, నిజామాబాద్ 83, పెద్దపల్లి 41, రాజన్న సిరిసిల్ల 10, రంగారెడ్డి 188, సంగారెడ్డి 89, సిద్ధిపేట 28, సూర్యాపేట 27, వికారాబాద్ 6, వనపర్తి 20, వరంగల్ రూరల్ 28, వరంగల్ అర్బన్ 127, యదాద్రి భోనగిరిలో 26 కేసులు నమోదయ్యాయి. 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్...Click here