Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన మరో మంత్రికి కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్గా తేలిందని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రజేశ్ పాఠక్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. నాలో కరోనా వ్యాధి లక్షణాలు ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు పరీక్ష చేయించుకున్నా. అందులో పాజిటివ్ అని తేలింది. కాబట్టి ఇటీవల నన్ను కలిసిన వారందరూ ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తూ క్వారంటైన్లోకి వెళ్లండి. కరోనా పరీక్ష చేయించుకోండి అని ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్ రాణి కరోనాతో మృతి చెంది కొద్ది రోజులు కూడా గడవక ముందే మరో మంత్రి కరోనా పాజిటివ్గా తేలారు. మంగళవారం నాటి సమాచారం ప్రకారం..ఉత్తరప్రదేశ్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష మార్కు దాటింది. 1800 మందికిపైగా రోగులు కరోనాతో ప్రాణాలు విడిచారు.