Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టైర్ పేలి ట్రాలీ వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ నాగరాజు(32) తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దఅంబర్ పేట్ పరిధిలోని ఔటర్ రింగ్రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. గుల్బార్గా నుంచి కవాడిపల్లికి వస్తున్న ట్రాలీ వాహనం కొహెడ వద్దకు రాగానే వెనుక టైరు పేలి అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ నాగరాజు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వాహనంలో డ్రైవర్కు సాయంగా వచ్చిన ఐనా ముత్త చెన్నయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు చికిత్స నిమిత్తం తరలించారు. డ్రైవర్ నాగరాజుది కర్ణాటకలోని బీదర్ జిల్లా మంగళగిరి ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.