Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నటుడు నవీన్ చంద్ర, యువ నటి చాందిని చౌదరి కలిసి నటించిన చిత్రం 'సూపర్ ఓవర్ ' ఈ చిత్రం ఈ నెల 22న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రెస్ మీట్ ఏర్పాటు చ ఏసింది. ఈ పెస్ మీట్ లో మాట్లాడిన చాందినీ చౌదరీ భావోద్వేగానికి గురి స్టేజ్ మీదే ఏడ్చేశారు.
ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్లో ఉండగా ఈ చిత్రం దర్శకుడు ప్రవీణ్ యాక్సిడెంట్కి గురి అయ్యి కన్నుమూశారు. దాన్ని గుర్తు చేసుకున్న చాందినీ స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యారు. క్రికెట్ బెట్టింగ్ మీద ప్రవీణ్ ఈ చిత్రాన్ని బాగా తీశాడు. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాము. ఈ మూవీ ప్రవీణ్కి అంకితం అని చాందినీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర ఆమెను ఓదార్చారు.
ఇక నవీన్ చంద్ర మాట్లాడుతూ.. మేము ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం. సినిమా కంటే ఆ మనిషితో గడిపిన నెల రోజులు. అది మరిచిపోలేము. ప్రవీణ్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇండస్ట్రీలో ప్రవీణ్ గురించి అందరికీ మంచి ఇంప్రెషన్ ఉంది. ప్రవీణ్ చనిపోయిన తరువాత ఈ సినిమాను అందరి ముందుకు తీసుకొచ్చేందుకు సుధీర్ చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్. అతడి గురించి మాకే ఎలానో ఉంది. వాళ్లింట్లో వాళ్లకు దేవుడు బలం ఇవ్వాలి అని ఎమోషనల్ అయ్యాడు.