Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం అయిలాపూర్లో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు... పాఠశాల సిబ్బంది, విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో యాజమాన్యం పాఠశాలను మూసివేసింది.