Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి విజృంభిస్తున్న వేళ.. టోక్యో ఒలింపిక్స్ నిర్వహణకు జపాన్ సిద్ధమవుతోంది. మహా క్రీడా సంగ్రామం మరో వంద రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ మస్కట్, చిహ్నాలను నిర్వహణ కమిటీ ఆవిష్కరించింది. కరోనా రక్కసి ముప్పు పొంచి ఉన్న వేళ వైరస్ నిరోధానికి ఆరోగ్య సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నట్టు టోక్యో గవర్నర్ యురికో తెలిపారు.
కరోనా కేసులు పెరుగుదల, క్రీడల పేరుతో కుంభకోణాలు జరిగాయని.. ప్రజల నుంచి ఒలింపిక్స్ నిర్వహణపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ సంస్థలు నిర్వహించిన ఒపినీయన్ పోల్స్లో 80శాతం మంది జపాన్ ప్రజలు ఒలింపిక్స్ను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని కోరుతున్నట్లు తేలింది. అయినప్పటికీ ఒలింపిక్స్ను నిర్వహించాలని నిర్వహణ కమిటీ పట్టుదలగా ఉంది.