Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. దీంతో కొంత మంది కరోనా భారీనపడి మరణిస్తున్నారు. మరికొంత మంది కరోనా భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ మహిళ భర్తకు కరోనా సోకిందన భయంతో చేసుకుంది. పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన సుద్దాల మొండయ్యకు రెండు వారాల కిందట కరోనా సోకింది. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం మొండయ్య భార్య జలజ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో భర్తకు కరోనా సోకిందనే మనస్తాపంతో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.