Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మల్కాజిగిరి
గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్ వోటి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సోమవారం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.రాజస్థాన్ కు చెందిన దేవేందర్ సింగ్, యుపీ రాష్ట్రానికి చెందిన రవీంద్ర కుమార్, ఆగ్రాకు చెందిన యాదవ్ వీరు ముగ్గురు స్నేహితులు. ఈజీగా డబ్బు సంపాదించాలని విశాఖపట్నం అరకుకు చెందిన హరిని సంప్రదించి తక్కువ ధరకు గంజాయి కొని వివిధ రాష్ట్రాలలో సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలొ విస్వాసనియ సమాచారము మేరకు నిషేధిత గంజాయిని అక్రమంగా ఆంద్రప్రదేశ్ లోని అరకు ప్రాంతం నుండి హైదరాబాద్ మీదుగా లారీ కంటైనర్లో తరలిస్థున్నారన్న
విస్వాసనియ సమాచారము మేరకు అవుటర్ రింగ్ రోడ్డుపై మాటు వేసి ఉత్తరప్రదేశ్ కు తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాలోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించగా. వారి వద్ద నుండి 200 కేజీల గంజాయి, ఒక లారీ,15 వేల రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వీటి విలువ 40లక్షల50వేల వరుకు ఉంటుందని కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. లారీలో ప్రత్యేకమైన క్యాబిన్ తయారు చేసి దానిలో గంజాయి తలరిస్తున్నారని సిపి తెలిపారు , గతంలో కూడా కొందరు ఇలానే లారీలో క్యాబిన్ ద్వారా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నారని సిపి తెలిపారు, వీరిపై పిడి ఆక్ట్ కూడా నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం ప్రత్యక బృందాలు గాలిస్థున్నయని తెలిపారు.