Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆల్వీన్కాలనీలో గంజాయి తాగుతున్న నలుగురు స్టూడెంట్లను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి గంజాయి, హుక్కా స్వాధీనం చేసుకున్నారు. అంజయ్యనగర్కు చెందిన నర్సింహారెడ్డి కుమారుడు సిరిగిద్ద శశాంక్రెడ్డి(22) కీసరలోని ఓ ఇంజనీరింగ్కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి సమీపంలో ఓ పెంట్ హౌజ్ను అద్దెకు తీసుకుని స్నేహితులతో ఉంటున్నాడు. ఆల్వీన్ కాలనీలోనిలో ఓ వ్యక్తి వద్ద శంశాక్రెడ్డి గంజాయి కొని తన స్నేహితులైన తన్మయి శ్రీసాయి(22), ఆల్వీనికాలనీకి చెందిన పి.అరుణ్కుమార్(22), కందిరేగుల అవినాష్ (25)తో కలిసి ఈ నెల 13న గదిలో గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 700గ్రాముల గంజాయి, హుక్కా సామాను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.