Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పెగాసస్ హ్యాకింగ్, ఇతర అంశాలపై పార్లమెంట్ దద్దరిల్లుతూనే ఉంది. వాటిపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి. జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తొమ్మిదోరోజు రెండు సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల వరకూ సభ్యుల నిరసనల మధ్య కొనసాగిన లోక్సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన కార్యకలాపాలు శనివారానికి వాయిదాప్డడాయి. సభలో విపక్ష నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మాకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేయాల్సి వచ్చింది.