Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీలంక టూర్ లో ఉన్న మరో ఇద్దరు ఇండియన్ క్రికెటర్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. స్పిన్నర్ యజువేంద్ర చాహెల్ తో పాటు కృష్ణప్ప గౌతమ్ లు కోవిడ్ పరీక్షలో పాజిటివ్గా తేలినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. భారత జట్టులో కృణాల్ పాండ్యాకు తొలుత వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ అతనితో కలిశారు. ఈ నేపథ్యంలో చాహల్, గౌతమ్లకు కూడా వైరస్ సోకినట్లు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా రెండవ, మూడవ టీ20 మ్యాచ్లను ఆడలేదు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను ఇండియా కోల్పోయిన విషయం తెలిసిందే.