Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రధానమంత్రికి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ లేఖ రాశారు. ఓబీసీ ల క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తేయాలని కోరారు. మోదీ తన మంత్రి వర్గంలో 27 మంది బీసీ మంత్రులను క్రిమిలేయర్ చూసి పదవులు కట్టబెట్టరా అని ఆయన ప్రశ్నించారు. బీసీలకు పేరుకు 27 శాతం కేటాయించినా ఇప్పటి వరకు 9 నుంచి 10 శాతం కూడా అమలు కాలేదన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని తొలగించకుంటే వందేండ్లు అయినా బీసీలకు న్యాయం జరగదని తెలిపారు. పి.వి.నరసింహారావు పీఎంగా ఉన్నప్పుడు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ను ఇప్పటికీ పెంచలేదన్నారు.