Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 2023 తర్వాత లక్ష నాగిళ్లతో దున్ని కేసీఆర్ ఫామ్ హౌస్ను బడుగులకు పంచుతామన్నారు. హుజురాబాద్లో జరుగుతుంది బైపోల్స్ కాదని, కేసీఆర్కు బైయింగ్ ఎలక్షన్స్ అని అన్నారు. ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు రారేండారూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మెడలు వంచి బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు.కేసీఆర్పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై సీఎంకు చితశుద్ది లేదని విమర్శించారు. పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేయిస్తున్నారన్నారు, ఫారెస్ట్ అధికారులను పంపి పోడు రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ స్పష్టం చేశారు.