Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. కొండ్లు మరీదయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై ధర్మాసనం విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మైనింగ్ పేరుతో వేలాది చెట్లను నరికి, రోడ్డు వేయడంపై ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించింది. పరిధిని దాటి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్ చేశారని గుర్తించింది. మరోవైపు అక్రమాలకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని ఆదేశించింది. గ్రీన్ ట్రైబ్యునల్ నియమించిన కమిటీలో విశాఖ జిల్లా కలెక్టర్, కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర గనులశాఖ, పీసీబీ అధికారులు ఉన్నారు. అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతంలో పర్యటించి... మైనింగ్ అనుమతులు, పరిధి, అక్రమ మైనింగ్, రోడ్డు నిర్మాణం తదితర అంశాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.