Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రిభువనగిరి: హైదరాబాద్ మేడిపల్లిలోని యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. రూ.76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల ప్లాట్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న (గురువారం) సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఓ వెంచర్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారంతో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్గా మోత్కుర్ సబ్ రిజిస్ట్రార్ ఖాదర్ పాషా నియమితులయ్యారు.