Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పవన్కల్యాణ్ రానా ప్రధాన పాత్రల్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్`` రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 12గా వస్తున్న ఈ చిత్రాన్ని సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్. అయితే ఈ చిత్త్రానికి సంబంధించిన అప్ డేట్ ఒకటి విడుదల చేశారు. 'వెలకమ్ ఏ బోర్డ్ నిత్యామీనన్` అంటూ చిత్రబృందం పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో పవన్కు భార్యగా నిత్యామీనన్ నటించనున్నట్టు సమాచారం.