Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోగులాంబ గద్వాల: ట్రాక్టర్ ఇంజిన్ బోల్తాపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు (16) అదే గ్రామానికి చెందిన ఓ రైతుపోలంలో ట్రాక్టర్తో రూటర్ కొట్టి ఇంటికి వస్తున్నాడు. తిరుగు ప్రయాణంలో ఉలిగపల్లి నుంచి బిజ్వారం వెళ్లే దారిలోని లింగమయ్య మూలమలుపు వద్ద అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. గమనించిన స్థానికులు ట్రాక్టర్ కింది భాగం నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆంజనేయులు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.