Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీని కర్ణాటక తాజా ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కలిశారు. ప్రధాని పిలుపు మేరకు శుక్రవారం ఢిల్లీలోని ప్రధాని నివాసానికి తన మంత్రులతో కలిసి వెళ్లారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధాని మోడీని బసవరాజు కలవడం ఇదే మొదటిసారి. కాగా, కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరగా ప్రధాని సముఖత వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా నూతన ప్రయాణం ప్రయాణం ప్రారంభించిన బసవరాజుకు మోడీ శుభావకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా పూర్తి మద్దతు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.