Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రి భవనం పైనుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్.. కరోనా లక్షణాలతో ఈ నెల 24న ఆస్పత్రిలో చేరాడు. మరుసటి రోజు కొవిడ్ నిర్ధారణ కావడంతో అప్పటినుంచి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మనస్థాపానికి గురైన బాధితుడు ఎంజీఎం ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు.