Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న తమను వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తొక్కుకుంటూ వెళ్లాడని, దాంతో తాము గాయపడ్డామని సీపీఐ(ఎం) ఏపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను పెంపు, చెత్తపై నూతనంగా పన్ను విధించడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట తాము భైఠాయించి ఆందోళనకు దిగామన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లోకి వెళ్లకుండా మెట్లపై కూర్చుని స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబును అడ్డుకున్నామని చెప్పారు. అయినా ఎమ్మెల్యే రాంబాబు మెట్లపై కూర్చున్న సీపీఐ(ఎం) కార్యకర్తలపై కాళ్లు పెట్టి తమను గాయపరిచుకుంటూ వెళ్లారని వారు ఆరోపించారు.