Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కూతురి భర్త మరణించడంతో ఆమెకు మరో పెండ్లి చేయాలని ఆమె తల్లి నిర్ణయించుకుంది. అందుకు తన మనవడు అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె.. బాబును తీసుకుని ఓ బావిలో పడేసి హత్య చేసింది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట ఏరియాకు చెందిన నాగమణి కూతురు సుజాతకు కొన్నేండ్ల క్రితం వివాహం కాగా ఆమె భర్త మరణించాడు. అనంతరం సూజతకు బాబు జన్మించాడు. ఆ తర్వాత ఆమె జనార్ధన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సూజాతకు కొడుకు లేకపోతే తాను ఆమెను పెండ్లి చేసుకునేవాడినని సూజత తల్లి నాగమణితో జనార్ధన్ అన్నాడు. దాంతో ఆ బాబును ఎలాగైనా వదిలించుకోవాలని నాగమణి పథకం పన్నింది. శుక్రవారం ఉదయం ఏడాదిన్నర బాబును తీసుకుని సమీప బావి వద్దకు తీసుకెళ్లి దాంట్లో పడేసింది. దాంతో అతను చనిపోయాడు.
ఇదిలా ఉండగా తన కుమారుడు కనిపించడం లేదంటూ సంగారెడ్డి పోలీసులకు సుజాత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజంపేట ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాబును నాగమణి తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. దాంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించింది. నాగమణితో పాటు జనార్ధన్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.