Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్లో జరిగే బోనాల కోసం పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. మహంకాళి లాల్ దర్వాజ టెంపుల్తో పాటు సిటీలో ఉన్న అన్ని ఆలయాల్లో పూజలు ఉంటాయన్నారు. ఎల్లుండి రంగంతో పాటు అంబారీ ఊరేగింపు ఉంటుందన్నారు. 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఉంటుందన్నారు. హోమ్ గార్డ్ నుంచి సీపీ వరకు అందరూ బందోబస్తులో పాల్గొంటారని అంజనీకుమార్ తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్లు కూడా ఉన్నాయని.. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ టీవీల ద్వారా ఊరేగింపును పర్యవేక్షిస్తామన్నారు.