Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివకాశి: తమిళనాడులోని శివకాశి సమీపంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి బాణసంచా తయారుచేస్తున్న గది నేలమట్టం అయ్యింది. పేలుడు సమయంలో కర్మాగారంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలార్పుతున్నారు.