Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని తన స్నేహితులిద్దరిని కత్తితో ఓ 17 ఏండ్ల బాలుడు దాడి చేశాడు. దాంతో ఆ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న ఢిల్లీలో సందీప్, ఓం లు ఇద్దరూ స్కూటర్పై వెళ్లుండగా వారిని నిందితుడు బిందాపుర్లో కలిశాడు. మద్యం తాగడానికి రూ. 50 వారిని అడిగాడు. అందుకు సందీప్ నిరాకరించడంతో బాలుడు తనతో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వారిపై కత్తితో దాడికి దిగాడు. ఈ క్రమంలోనే వారిని బాలుడు కత్తితో పొడిచి గాయపరిచాడు. మిగిలిన ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించగా సందీప్ అనే యువకుడి శరీరంలో 7 కత్తిపోట్లు దిగినట్టు అధికారులు తెలిపారు. అయితే అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. మరో యువకుడు ఓం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని తెలిసింది.