Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాది ఇస్మాయిల్ భాయ్ వురపు లంబు భద్రతాదళాల చేతిలో హతమయ్యాడు. కశ్మీరు ఐజీపీ విజయ్ కుమార్ విలేకర్ల సమావేశంలో వివరాలను తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పాకిస్థానీ ఉగ్రవాది లంబూ ఎన్కౌంటర్లో మరణించాడని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మరొక ఉగ్రవాది కూడా మరణించాడని, అతని వివరాలను ఇంకా తెలియరాలేదని చెప్పారు
లంబు నుంచి ఓ ఏకే-47 రైఫిల్, ఓ ఎం-4 రైఫిల్ లను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడి కోసం ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లొజివ్ డివైస్ (ఈఐడీ)ని లంబు యే తయారు చేశాడని అనుమానం వ్యక్తం అవుతోంది.