Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోనాలకు తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆద్వర్యంలో అన్ని సదుపాయాలను సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తామని పేర్కొన్నారు.